దుబాయ్ ఎక్స్పో గ్లోబల్ ఎంబాసిడర్ లియోనెల్ మెస్సి
- January 13, 2016
మల్టీ అవార్డ్ విన్నింగ్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి, దుబాయ్ ఎక్స్పో 2020 గ్లోబల్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. లియోనెల్ మిస్సీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సోసల్ మీడియాలో 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. దుబాయ్ ఎక్స్పోకి లియోనెల్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్గా పని చేయడం ద్వారా ఈ ఎక్స్పో ప్రపంచ వ్యాపితంగా ఇంకా ఎక్కువమందికి రీచ్ అవుతుందని ఎక్స్పో 2020 డైరెక్టర్ జనరల్ రీమ్ ఇబ్రహీమ్ అల్ హషిమి చెప్పారు. 'కనెక్టింగ్ మైండ్స్ క్రియేటింగ్ ది ఫ్యూచర్' అనే కాన్సెప్ట్తో ఎక్స్పో 2020 ప్లాన్ చేశారు. ఎక్స్పో 2020 గ్లోబల్ అంబాసిడర్స్ని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి నుంచి ఎంపిక చేస్తారు. క్రీడలు, కళలు, సంగీతం, కల్చర్, మరియు మీడియా.. అలాగే ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఫిలాంథ్రపీ అండ్ సస్టెయినబులిటీ విభాగాల్లోంచీ ఎంబాసిడర్స్ని ఎంపిక చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అంబాసిడర్స్ ఎక్స్పో 2020 ప్రత్యేకతల్ని వివరిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









