గురుద్వారా సందర్శన సందర్భంగా..రోటీలు తయారు చేసిన ప్రిన్స్‌ ఛార్లెస్‌

- November 14, 2019 , by Maagulf
గురుద్వారా సందర్శన సందర్భంగా..రోటీలు తయారు చేసిన ప్రిన్స్‌ ఛార్లెస్‌

 

దిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ బుధవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లోని ఔషధీవనంలో ప్రిన్స్‌ ఛార్లెస్‌ మొక్కను నాటారు. అనంతరం గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికింది. అనంతరం అక్కడి సిక్కులతో కలిసి ముచ్చటించారు. వారితో ఫొటోలు కూడా దిగారు. ప్రసాదం తయారీశాలకు వెళ్లి రోటీలు తయారు చేశారు. గురునానక్‌ 550వ జయంతి సమయంలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్స్‌ ఛార్లెస్‌ అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రావడం ఇది పదోసారి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com