రోడ్డు దాటేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ వాడొద్దు: పాదచారులకు దుబాయ్‌ పోలీస్‌ హెచ్చరిక

- November 15, 2019 , by Maagulf
రోడ్డు దాటేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ వాడొద్దు: పాదచారులకు దుబాయ్‌ పోలీస్‌ హెచ్చరిక

దుబాయ్‌ పోలీస్‌, పాదచారులకు రోడ్డు దాటేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ వినియోగించొద్దని హెచ్చరించించారు. గతంలో యూఏఈ అథారిటీస్‌, రోడ్డు దాటేటప్పుడు పాదచారులు మొబైల్‌ ఫోన్‌లో టెక్స్‌ట్‌ మెసేజ్‌లు పంపడం, ఛాటింగ్‌ చేయడం మంచిది కాదంటూ హెచ్చరించిన విషయం విదితమే. రోడ్డు దాటేటప్పుడు ఇలాంటివి చేయడం వల్ల డిస్ట్రాక్షన్‌ అవుతుందనీ, వేగంగా వచ్చే వాహనాల్ని గమనించకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని అబుదాబీ ట్రాఫిక్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన జమాల్‌ అల్‌ అమెరి అనే అధికారి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com