రవితేజ - శృతిహాసన్ 'క్రాక్' ప్రారంభం
- November 15, 2019మాస్ మహారాజ్ రవితేజ 66వ చిత్రానికి `క్రాక్` అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తుంది. మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మూవీ యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
హైదరాబాద్లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్పై బి.మధు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్కు దిల్రాజు, డి.సురేష్బాబు, ఎన్.వి.ప్రసాద్, సురేందర్ రెడ్డి, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, పరుచూరి బ్రదర్స్, దాము, బీవీఎస్ఎన్ ప్రసాద్, రామ్ తాళ్లూరి లతో పాటు పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తొలి సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. దిల్రాజు, సురేందర్ రెడ్డిలు దర్శకుడు గోపిచంద్ మలినేని స్క్రిప్ట్ను అందించారు `డాన్శీను`, `బలుపు` లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ఈ క్రాక్ మూవీ ఆశించిన విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు