ఇక ఆ సినిమాలు చేయను: అనుష్క
- November 16, 2019
చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు అంటోంది నటి అనుష్క. నిజానికి ఈ అమ్మడికి పేరు తెచ్చిన పాత్రలన్నీ చారిత్రక కథా చిత్రాల్లోనివేనన్నది తెలిసిందే. సూపర్ చిత్రంతో టాలీవుడ్కు, రెండు చిత్రంతోకోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్ తొలి చిత్రాల్లోనే అందాలను విచ్చలవిడిగా పరిచేసింది. అరుంధతి చిత్రం ఈ అమ్మడుకి అనూహ్యంగా మలుపు తిప్పింది. అందులో జేజెమ్మ పాత్రలో అనుష్కరాజసంతో పాటుఅద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత నటించిన రుద్రమదేవి, బాహుబలి 1, 2 చిత్రాలు నటిగా తారస్థాయిలో కూర్చోబెట్టాయి. ఈ చిత్రాలే ఆమెను హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగానిలబెట్టాయి. అలాంటిది చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు బాబూ అంటోందట ఈ బ్యూటీ. ప్రస్తుతం సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశ్శబ్దంఅనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటిస్తోందని సమాచారం.
మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి అంజలి కూడా ముఖ్యపాత్రలో నటిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు ఫస్ట్లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నటి అనుష్క ఒక ఇంటర్వ్యూలో ఇకపై చరిత్ర కథా చిత్రాల్లో నటించకూడదనినిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ తరహా చిత్రాలను పూర్తి చేయడానికి అధిక రోజులు పడుతోందని, అదీ కాకుండా మేకప్కు అధిక సమయం పడుతోందని చెప్పుకొచ్చింది.
ఆ తరహా చిత్రాలకు అధిక సమయాన్నికేటాయించడంవల్ల ఆరోగ్యపరంగా అలసటకు గురవుతున్నట్లు తెలిపింది. ఇలాంటి కారణాలతోనే చరిత్ర కథా చిత్రాల్లో నటించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్లో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను ఆ చిత్రంలో నటించడానికి నిరాకరించినట్లు తాజా సమాచారం. తదుపరి దర్శకుడు గౌతమ్మీనన్ దర్శకత్వంలో అనుష్క నటించే అవకాశం ఉన్న ట్లు తాజా సమాచారం.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









