బహ్రెయిన్ లో BJP కోర్ కమిటీ ఏర్పాటు
- November 17, 2019
_1573970902.jpg )
_1573970973.jpg )
బహ్రెయిన్:బహ్రెయిన్ లో భారతీయ జనతా పార్టీ శాఖ ను ప్రారంభించారు 15 నవంబర్ శుక్రవారం రోజున కలవర హోటల్ మనమా లో డాక్టర్ వెంకట్ రెడ్డి, అలె గంగాధర్, ప్రేమ్ సాగర్ వెంక్కట స్వామి కిరణ్ విట్ఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సహాకారంతో బాహారాయిన్ లో కోర్ కమిటీ ఏర్పాటు చేశామని కో-కన్వీనర్ అలె గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైయ్యారు. తెలంగాణలో 2024 లక్ష్యంగా కాషాయ జండా రెప రెపలాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కమిటీ సహాయ సహకారాలు అందిస్తుందని కన్వీనర్ డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.అదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్య ల పరిష్కారానికి తోడుగా ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ భారత్ జెనరల్ సెక్రెటరీ ప్రదీప్ హాజరైనారు . కమిటీ సభ్యులు కన్వీనర్ డాక్టర్ వెంకట్, కో-కన్వీనర్ అలె గంగాధర్, వెంకటస్వామి, ప్రేమసాగర్ గుప్తా, విట్ఠల్, కిరణ్ మోహన్ రెడ్డి, నర్సా గౌడ్,వేణు తదితరులు పాల్గొన్నారు. మీడియా కోఆర్డినేటర్ గా గంగుల సుదర్శన్ పాల్గొన్నారు.
-- రాజేశ్వర్ గౌడ్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







