ఎమిరాతీలకు వీసా-ఆన్-అరైవల్ ప్రకటించిన ఇండియా
- November 18, 2019
నవంబర్ 16 నుంచి యూఏఈ జాతీయులకు వీసా ఆన్ ఎరైవల్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలు, అలాగే మానవ సంబంధాల్ని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీసా ఆన్ అరైవల్, యూఏఈ జాతీయులకు 60 రోజులకుగాను అందించనున్నారు. బిజినెస్, టూరిజం, కాన్ఫరెన్స్ అలాగే మెడికల్ అవసరాల నిమిత్తం డబుల్ ఎంట్రీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో వుంటుంది. బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైద్రాబాద్, కోల్కతాతోపాటు ముంబై విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. ఇ-వీసా లేదా రెగ్యులర్ / పేపర్ వీసా గతంలో వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది. తొలిసారి యూఏఈకి వచ్చేవారు ఇ-వీసా లేదా రెగ్యులర్/పేపర్ వీసాకి అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది. పాకిస్తానీ మూలాలున్న యూఏఈ జాతీయులకు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం లభించదు.
తాజా వార్తలు
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!









