ఎమిరాతీలకు వీసా-ఆన్-అరైవల్ ప్రకటించిన ఇండియా
- November 18, 2019
నవంబర్ 16 నుంచి యూఏఈ జాతీయులకు వీసా ఆన్ ఎరైవల్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలు, అలాగే మానవ సంబంధాల్ని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీసా ఆన్ అరైవల్, యూఏఈ జాతీయులకు 60 రోజులకుగాను అందించనున్నారు. బిజినెస్, టూరిజం, కాన్ఫరెన్స్ అలాగే మెడికల్ అవసరాల నిమిత్తం డబుల్ ఎంట్రీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో వుంటుంది. బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైద్రాబాద్, కోల్కతాతోపాటు ముంబై విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. ఇ-వీసా లేదా రెగ్యులర్ / పేపర్ వీసా గతంలో వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది. తొలిసారి యూఏఈకి వచ్చేవారు ఇ-వీసా లేదా రెగ్యులర్/పేపర్ వీసాకి అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది. పాకిస్తానీ మూలాలున్న యూఏఈ జాతీయులకు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం లభించదు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..