ఎమిరాతీలకు వీసా-ఆన్-అరైవల్ ప్రకటించిన ఇండియా
- November 18, 2019
నవంబర్ 16 నుంచి యూఏఈ జాతీయులకు వీసా ఆన్ ఎరైవల్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలు, అలాగే మానవ సంబంధాల్ని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీసా ఆన్ అరైవల్, యూఏఈ జాతీయులకు 60 రోజులకుగాను అందించనున్నారు. బిజినెస్, టూరిజం, కాన్ఫరెన్స్ అలాగే మెడికల్ అవసరాల నిమిత్తం డబుల్ ఎంట్రీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో వుంటుంది. బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైద్రాబాద్, కోల్కతాతోపాటు ముంబై విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. ఇ-వీసా లేదా రెగ్యులర్ / పేపర్ వీసా గతంలో వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది. తొలిసారి యూఏఈకి వచ్చేవారు ఇ-వీసా లేదా రెగ్యులర్/పేపర్ వీసాకి అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది. పాకిస్తానీ మూలాలున్న యూఏఈ జాతీయులకు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం లభించదు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







