ఎమిరాతీలకు వీసా-ఆన్-అరైవల్ ప్రకటించిన ఇండియా
- November 18, 2019
నవంబర్ 16 నుంచి యూఏఈ జాతీయులకు వీసా ఆన్ ఎరైవల్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలు, అలాగే మానవ సంబంధాల్ని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీసా ఆన్ అరైవల్, యూఏఈ జాతీయులకు 60 రోజులకుగాను అందించనున్నారు. బిజినెస్, టూరిజం, కాన్ఫరెన్స్ అలాగే మెడికల్ అవసరాల నిమిత్తం డబుల్ ఎంట్రీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో వుంటుంది. బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైద్రాబాద్, కోల్కతాతోపాటు ముంబై విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. ఇ-వీసా లేదా రెగ్యులర్ / పేపర్ వీసా గతంలో వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది. తొలిసారి యూఏఈకి వచ్చేవారు ఇ-వీసా లేదా రెగ్యులర్/పేపర్ వీసాకి అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది. పాకిస్తానీ మూలాలున్న యూఏఈ జాతీయులకు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం లభించదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







