సిరియాలో కారు బాంబు పేలుడు..షుమారు పది మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
- November 24, 2019
అంకారా : ఈశాన్య సిరియాలో శనివారం జరిగిన కారు బాంబు పేలుడులో షుమారు పది మంది మృతి చెందినట్టు టర్కీ రక్షణ శాఖ తెలిపింది. ఈ దుర్ఘటనలో 20మందికి పైగా గాయాలయ్యాయి. టెల్అబియాడ్లోని పారిశ్రామిక వాడలో కారుబాంబు పేలుడు సంభవించింది. సిరియాలోని కుర్దీష్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. టెల్ అబియాడ్లో ఈ నెలలోనే అంతకుముందు రెండు కారు బాంబు పేలుళ్ళు జరిగి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈశాన్య సిరియాలోని పలు ప్రాంతాలకు టర్కీ విస్తరిస్తూ కుర్దీష్ బలగాలను తన సరిహద్దుల నుండి దూరంగా నెట్టివేస్తోంది. కుర్దీషులను ఉగ్రవాదులుగా టర్కీ భావిస్తుంది. ఇదే కుర్దీష్లు సిరియాలో ఐఎస్ఐతో అమెరికాతో కలిసి పోరాడారు.
తాజా వార్తలు
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







