వచ్చే నెల 26న అయ్యప్ప ఆలయం మూసివేత
- November 25, 2019
శబరిగిరుల్లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని వచ్చే నెల 26న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా పూజా కార్యక్రమాలు ఏవీ నిర్వహించడంలేదని ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. నాలుగు గంటల పాటు మూసివేసి తర్వాత సంప్రోక్షణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.
ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు సూర్యగ్రహణం ఉన్నట్టు పండితులు తెలిపారు. దాంతో నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేసి సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ఆలయాన్ని తెరిచిన అనంతరం పుణ్యవచన చేస్తారు. ఆ వెంటనే మూసివేస్తారు. 27వ తేదీన మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. కాాాగా ఈనెల 17 నుంచి అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మాలధారణతో తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!