వచ్చే నెల 26న అయ్యప్ప ఆలయం మూసివేత
- November 25, 2019
శబరిగిరుల్లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని వచ్చే నెల 26న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా పూజా కార్యక్రమాలు ఏవీ నిర్వహించడంలేదని ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. నాలుగు గంటల పాటు మూసివేసి తర్వాత సంప్రోక్షణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.
ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు సూర్యగ్రహణం ఉన్నట్టు పండితులు తెలిపారు. దాంతో నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేసి సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ఆలయాన్ని తెరిచిన అనంతరం పుణ్యవచన చేస్తారు. ఆ వెంటనే మూసివేస్తారు. 27వ తేదీన మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. కాాాగా ఈనెల 17 నుంచి అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మాలధారణతో తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







