వచ్చే నెల 26న అయ్యప్ప ఆలయం మూసివేత
- November 25, 2019
శబరిగిరుల్లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని వచ్చే నెల 26న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా పూజా కార్యక్రమాలు ఏవీ నిర్వహించడంలేదని ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. నాలుగు గంటల పాటు మూసివేసి తర్వాత సంప్రోక్షణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.
ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు సూర్యగ్రహణం ఉన్నట్టు పండితులు తెలిపారు. దాంతో నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేసి సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ఆలయాన్ని తెరిచిన అనంతరం పుణ్యవచన చేస్తారు. ఆ వెంటనే మూసివేస్తారు. 27వ తేదీన మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. కాాాగా ఈనెల 17 నుంచి అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మాలధారణతో తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







