సౌదీ అరేబియా:చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠా అరెస్ట్

- November 27, 2019 , by Maagulf
సౌదీ అరేబియా:చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠా అరెస్ట్

సౌదీ అరేబియా: వరుస చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠాలోని 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.సౌదీ అరేబియా లో ఈ గ్యాంగ్ పట్టుబడినట్లు పోలీస్ ప్రతినిధి మేజర్ హుస్సేన్ అల్ కహ్రని తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం యెమెన్ ముఠా ఇప్పటివరకు రెండు చోరీలకు పాల్పడ్డారు.మొత్తం 98 వేల దిర్హామ్ల విలువైన సొత్తు దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు.ఒక స్టోర్ లో 80 వేల రియాల్స్ దోచుకోగా,మరో చోరీ కేసులో 25 వేల రియాల్స్ చోరీ చేసినట్లు వివరించారు.తమ విచారణలో యెమెన్ ముఠా సభ్యులు నేరాలను అంగీకరించినట్లు మేజర్ హుస్సేన్ తెలిపారు.వారిపై అభియోగాలు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com