బంగ్లా కేఫ్ నరమేధం కేసులో... దోషులకు ఉరిశిక్ష
- November 28, 2019
ఢాకా:బంగ్లాదేశ్లో 2016లో ఓ కేఫ్లో చొరబడిన మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఈ కేసులో దోషులుగా తేలిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) మిలిటెంట్ గ్రూపుకు చెందిన ఏడుగురు సభ్యులకు ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో జేఎంబీ సభ్యుడిని నిర్దోషిగా తేల్చింది. ' మారణహౌమం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఇలాంటి వారికి ఉరే సరైన శిక్ష' అని తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ ముజీబుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో యాంటీ టెర్రరిస్ట్ ట్రిబ్యునల్ ఎదురుగా భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాపిడ్ యాక్షన్ బెటాలియన్, భద్రతా బలగాలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఎంబీ సానుభూతిపరులు కోర్టు ఆవరణకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు తీర్పును విమర్శించారు. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు దోషుల కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గులామ్ షరూర్ ఖాన్ జాకిర్ వెల్లడించిన వివరాల ప్రకారం...2016, జులై1న ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలోని హౌలీ ఆర్టీసన్ కేఫ్పై జేఎంబీ మిలిటెంట్ గ్రూపు సభ్యులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 22మంది మృతి చెందారు. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!