బంగ్లా కేఫ్ నరమేధం కేసులో... దోషులకు ఉరిశిక్ష
- November 28, 2019ఢాకా:బంగ్లాదేశ్లో 2016లో ఓ కేఫ్లో చొరబడిన మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఈ కేసులో దోషులుగా తేలిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) మిలిటెంట్ గ్రూపుకు చెందిన ఏడుగురు సభ్యులకు ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో జేఎంబీ సభ్యుడిని నిర్దోషిగా తేల్చింది. ' మారణహౌమం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఇలాంటి వారికి ఉరే సరైన శిక్ష' అని తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ ముజీబుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో యాంటీ టెర్రరిస్ట్ ట్రిబ్యునల్ ఎదురుగా భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాపిడ్ యాక్షన్ బెటాలియన్, భద్రతా బలగాలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఎంబీ సానుభూతిపరులు కోర్టు ఆవరణకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు తీర్పును విమర్శించారు. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు దోషుల కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గులామ్ షరూర్ ఖాన్ జాకిర్ వెల్లడించిన వివరాల ప్రకారం...2016, జులై1న ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలోని హౌలీ ఆర్టీసన్ కేఫ్పై జేఎంబీ మిలిటెంట్ గ్రూపు సభ్యులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 22మంది మృతి చెందారు. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్