దుబాయ్:ఘోర రోడ్డుప్రమాదం లో భారతీయ వైద్యుడు మృతి
- November 28, 2019
దుబాయ్: దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో భారత్కు చెందిన ప్రముఖ వైద్యుడు జాన్ మార్షల్ స్కిన్నర్(60) మృతి చెందారు. జుమేరా విలేజ్ సర్కిల్లోని తన ఇంటి నుంచి తాను పనిచేసే అల్ ముసల్లా మెడికల్ సెంటర్కు బయల్దేరిన స్కిన్నర్... వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న నిస్సాన్ కారు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్కిన్నర్ అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఉదయం విధులకు వెళ్లిన భర్త రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడతో భార్య సిసీ మార్షల్.. అల్ ముసల్లా మెడికల్ సెంటర్కు ఫోన్ చేసింది.
దీంతో ఆసుపత్రికి చెందిన అధికారులు బుధవారం ఉదయం అల్ రాఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతసేపటి తరువాత పోలీసుల నుంచి స్కిన్నర్ కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ప్రమాదంలో చనిపోయిన స్కిన్నర్ మృతదేహం కుసైస్ మార్చురీలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో వెంటనే భార్య, తోటి ఉద్యోగులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లి స్కిన్నర్ మృతదేహాన్ని గుర్తించారు.
కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన డాక్టర్ జాన్ మార్షల్ స్కిన్నర్ 20 ఏళ్లుగా యూఏఈలోనే వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన యూఏఈలో ప్రముఖ వైద్యులలో ఒకరు. ప్రిమాకేర్ క్లినిక్స్లో 16 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. స్కిన్నర్ డయాబెటిస్ నిపుణులని తోటి వైద్యుడు శశికుమార్ కల్లివలప్పిల్ పేర్కొన్నారు. అతని మృతి తమను షాక్కు గురి చేసిందన్నారు సహోద్యోగులు. స్కిన్నర్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ బహ్రెయిన్లో మెడిసిన్ చదువుతున్నారు. డాక్టర్ స్కిన్నర్ ఆరోగ్య నిపుణుల కుటుంబం నుండి వచ్చారు. అతని తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు అందరూ ఆయా రంగాలలో ప్రసిద్ధ వైద్యులు.
స్కిన్నర్ మృతితో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. విధులకు వెళ్లిన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య గుండెలవిసేలా విలిపిస్తోంది. అక్కడి ఫార్మాలిటీలను పూర్తి చేసి స్కిన్నర్ అంత్యక్రియలను జెబెల్ అలీ శ్మశానవాటికలో నిర్వహించునున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







