భారత్, శ్రీలంక మైత్రీ మరింత బలోపేతం : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
- November 29, 2019
భారత్, శ్రీలంక దేశాల మధ్య మైత్రీ సంబంధాలు బలంగా ఉన్నాయని, వీటిని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళతామని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అన్నారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్స తొలిసారి విదేశీ పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈమేరకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా రెండు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన రాజపక్సకు రాష్టప్రతి భవన్ వద్ద రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స విదేశాంగ మంత్రి జైశంకర్ను కలుసుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!