వాట్సాప్లో వస్తున్న కొత్త ఫీచర్
- November 30, 2019
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో అద్భుతమైన ఫీచర్ను తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్లో యూజర్లు గ్రూప్ చాట్లలో పంపే మెసేజ్లు వాటంతట అవే నిర్దిష్టమైన కాల వ్యవధి అనంతరం అదృశ్యమయ్యేలా ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్ పేరిట ఈ ఫీచర్ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ను ఆండ్రాయిడ్లో వాడుతున్న యూజర్లకు అందుబాటులో ఉండగా, త్వరలో ఐఓఎస్ యూజర్లకు, ఆ తరువాత పూర్తి స్థాయిలో అందరు యూజర్లకు ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఇక సదరు మెసేజ్లు ఎంత సేపటి తరువాత అదృశ్యం కావాలో యూజర్లు టైమ్ లిమిట్ సెట్ చేసుకునే విధంగా ఆప్షన్లను అందివ్వనున్నారు. ఈ క్రమంలో 1 గంట, 1 రోజు, 1 నెల, 1 ఏడాదిలలో ఎంత కాల వ్యవధినైనా యూజర్లు సెట్ చేసుకుంటే ఆ సమయం వరకు వాట్సాప్ గ్రూప్ చాట్లలో యూజర్లు పంపిన మెసేజ్లు ఉంటాయి. ఆ టైమ్ అయిపోగానే ఆ మెసేజ్లు వాటంతట అవే ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. ఇక త్వరలోనే వాట్సాప్లో డార్క్ మోడ్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తేనున్నారు.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









