వాట్సాప్లో వస్తున్న కొత్త ఫీచర్
- November 30, 2019
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే మరో అద్భుతమైన ఫీచర్ను తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్లో యూజర్లు గ్రూప్ చాట్లలో పంపే మెసేజ్లు వాటంతట అవే నిర్దిష్టమైన కాల వ్యవధి అనంతరం అదృశ్యమయ్యేలా ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్ పేరిట ఈ ఫీచర్ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ను ఆండ్రాయిడ్లో వాడుతున్న యూజర్లకు అందుబాటులో ఉండగా, త్వరలో ఐఓఎస్ యూజర్లకు, ఆ తరువాత పూర్తి స్థాయిలో అందరు యూజర్లకు ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఇక సదరు మెసేజ్లు ఎంత సేపటి తరువాత అదృశ్యం కావాలో యూజర్లు టైమ్ లిమిట్ సెట్ చేసుకునే విధంగా ఆప్షన్లను అందివ్వనున్నారు. ఈ క్రమంలో 1 గంట, 1 రోజు, 1 నెల, 1 ఏడాదిలలో ఎంత కాల వ్యవధినైనా యూజర్లు సెట్ చేసుకుంటే ఆ సమయం వరకు వాట్సాప్ గ్రూప్ చాట్లలో యూజర్లు పంపిన మెసేజ్లు ఉంటాయి. ఆ టైమ్ అయిపోగానే ఆ మెసేజ్లు వాటంతట అవే ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. ఇక త్వరలోనే వాట్సాప్లో డార్క్ మోడ్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తేనున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!