సౌదీ-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు..
- November 30, 2019
యూఏఈలో తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దుబాయ్ చేరుకున్న సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ను యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ జబీల్ ప్యాలెస్ లో సాదరంగా స్వాగతించారు.
అనంతరం జరిగిన భేటీలో సౌదీ రాజు, ఆయన ప్రతినిధులు బ్రృందంతో షేక్ మొహమ్మద్ ఇతర అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం అందిపుచ్చుకోవటంపై చర్చించారు.
అంతకుముందు యూఏఈ రాజధాని అబుదాబిలో మంగళవారం పర్యటించిన సౌదీ రాజును అబుదాబి క్రొన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ నుంచి సాదర స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య నాలుగు కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో జరిగిన సౌదీ-ఎమిరాటి సమన్వయ మండలి సమావేశంలో ఈ మేరకు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అలాగే ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉండే 7 వ్యూహాత్మక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







