అబుధాబి:నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధన
- December 01, 2019
అబుధాబి:అత్యవసర వాహనాలకు మార్గం సుగమం చేస్తూ అబుదాబిలో కొత్తగా ట్రాఫిక్ నిబంధన అమల్లోకి వచ్చాయి.అబుధాబిలోని కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ మార్గంలోని రైట్ లేన్లో డిసెంబర్ 1 నుండి వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
ఎమర్జెన్సీ వాహనాలు, ప్రజా రవాణా బస్సులు, ట్యాక్సీలను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. ఈ విషయాన్ని అబుదాబి పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే 400 దిర్హమ్ వరకు జరిమాన విధించనున్నట్లు వెల్లడించింది.
అత్యవసర వాహనాలకు మార్గం కల్పించేలా యుఎఇ అధికారులు ఇప్పటికే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే లక్ష్యం తో గత అక్టోబర్లో గీవ్ వే, గీవ్ హోప్(దారి ఇవ్వు, నమ్మకం ఇవ్వు) అనే నినాదంతో ప్రచారం చేపట్టింది.
ప్రచారంలో భాగంగా ఎమర్జెన్సీ వాహనాలకు ఎలా దారీ ఇవ్వాలో పలు సూచనలు చేశారు అధికారులు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ పడినా అత్యవసర వాహనాలకు దారి ఇచ్చేందుకు తమ వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుందని వీడియోలో వివరించారు.
తాజా వార్తలు
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ









