జనవరి 31 న విడుదల కానున్న 'నిశ్శబ్దం'
- December 02, 2019హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం' సినిమా రూపొందింది. థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. దాదాపుగా విదేశాల్లో చిత్రీకరించబడిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు.
జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలకమైన పాత్రను పోషించాడు. 'భాగమతి' తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు వున్నాయి. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి