అమెరికా లో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం
- December 02, 2019
డిసెంబర్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు. టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో వైభవ్ ఫుడ్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నారు. అక్కడే ఎంఎస్ చేస్తున్న జుడీ స్టాన్లీ పిని రియోతో కలిసి రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది.ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ కు డ్రైవర్, డేవిడ్ స్టోరేజ్ వాహనం అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
తమ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందడం పట్ల టీఎస్ యూ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటన దురదృష్టకరమని అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది అని అధికారులు తెలియజేశారు. భారత ఎంబస్సి వారిని సంప్రదించి ఆ ఇద్దరి మృతదేహాలను వారి ఇంటికి చేరేలా చెయ్యాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







