జాయేద్ మరియు గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసిన భారత్
- December 04, 2019
యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరియు మహాత్మా గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్లో భారత-యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా ఈ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. అనంతరం 'ఫిలేట్లీ' ఆధిపత్య అంశంగా అహ్మద్ అల్ బన్నా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కొనసాగింది. రిసెప్షన్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, డాక్టర్ అల్ బన్నా ఏర్పాటు చేసిన అరుదైన స్టాంపులను చూడటం జరిగింది.
కేరళకు చెందిన ప్రముఖ స్టాంప్ కలెక్టర్ ఉమ్మర్ ఫరూక్, తాను సేకరించిన వివిధ యూఏఈ స్టాంపులను ఈ ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలో ఇలాంటి స్టాంపులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. భారతదేశంలో ఫిలాటెలిస్టులు మాట్లాడుతూ, ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు పోస్ట్ మార్క్ ఇవ్వడం భారతదేశంలో అరుదైన గౌరవం మరియు యూఏఈ మరియు భారతదేశం మధ్య ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రదర్శనను భారత ప్రభుత్వ పోస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో దుబాయ్లోని ‘ఎమిరేట్స్ ఫిలాటెలిక్ అసోసియేషన్’ మరియు భారతదేశం లోని ‘ఆల్ ఇండియా ఫిలాటెలిక్ ఫెడరేషన్’ & ‘ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ రిసెప్షన్లో ఎమిరాతీ డిజైనర్ ‘షంసా అల్ మెహైరి’ రూపొందించిన సాంప్రదాయ యూఏఈ దుస్తులను కలిగి ఉన్న ఫ్యాషన్ షో అందరిని ఆకర్షించింది. యూఏఈ తో బలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న స్థానిక సంస్థ ‘సి.డి. ఫౌండేషన్’ ఈ ఫ్యాషన్ షోను నిర్వహించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం