పాప కోసం మరో పథకం.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
- December 04, 2019
చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజానికి ఈ పథకం పాతదే అయినా మరింత మందికి చేరవేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. బాలిక సమృద్ధి యోజన స్కీమ్ ఇది. 1997 నుంచే అమలులో ఉంది ఈ స్కీమ్. ఆడపిల్లలను బడి బాట పట్టించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. బాలిక సమృద్ధి యోజన కింద ఆడ పిల్ల పుట్టిన తరువాత అమ్మకు రూ.500 క్యాష్ గిప్ట్గా ఇస్తారు. తర్వాత ఆ పాప స్కూల్కు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తరువాత డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
చిన్నారికి ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందజేస్తారు. 4వ తరగతిలో రూ.500, 5వ తరగతిలో రూ.600, 7వ తరగతిలో రూ.700, 8వ తరగతిలో రూ.800, 9వ తరగతిలో రూ.1000 స్కాలర్ షిప్ అందజేస్తారు. ఈ పథకంలో చేరాలంటే గ్రామాలలో అంగన్వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్ అప్లికేషన్ ఫిల్ చేసి పథకంలో చేరవచ్చు. పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. స్కీమ్ అప్లికేషన్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







