విజన్ 2030: వివిధ విదేశీ నిపుణులకు జాతీయతను మంజూరు చేయనున్న సౌదీ
- December 05, 2019
రియాద్: 2016 లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం సౌదీ విజన్ 2030 కు అనుగుణంగా చమురు ఆధారిత సౌదీ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరుస్తూ జాతీయ అభివృద్ధి మరియు పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రతిభావంతులైన విదేశీ నిపుణులకు సౌదీ జాతీయతను మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసిన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్.
దాదాపు రెండు నెలల క్రితం జారీ చేసిన రాయల్ డిక్రీ ప్రకారం, ఇస్లామిక్ పండితులతో పాటు అణు మరియు పునరుత్పాదక ఇంధనం, మెడిసిన్, ఫార్మకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆయిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎకాలజీ, ఆస్ట్రోనాటిక్స్, ఏవియేషన్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ వంటి వివిధ విభాగాలలోని ప్రముఖ నిపుణులకు సౌదీ జాతీయత మంజూరు చేయబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట మరియు సృజనాత్మక వ్యక్తులు సౌదీ అరేబియాలో నివసించడానికి మరియు పని చేయడానికి మార్గం సుగమం అవుతుందని నివేదిక తెలిపింది. నివేదించబడిన సహజీకరణలో ముస్లిమేతర నిపుణులు కూడా ఉన్నారా అనేదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









