విజన్ 2030: వివిధ విదేశీ నిపుణులకు జాతీయతను మంజూరు చేయనున్న సౌదీ
- December 05, 2019
రియాద్: 2016 లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం సౌదీ విజన్ 2030 కు అనుగుణంగా చమురు ఆధారిత సౌదీ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరుస్తూ జాతీయ అభివృద్ధి మరియు పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రతిభావంతులైన విదేశీ నిపుణులకు సౌదీ జాతీయతను మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసిన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్.
దాదాపు రెండు నెలల క్రితం జారీ చేసిన రాయల్ డిక్రీ ప్రకారం, ఇస్లామిక్ పండితులతో పాటు అణు మరియు పునరుత్పాదక ఇంధనం, మెడిసిన్, ఫార్మకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆయిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎకాలజీ, ఆస్ట్రోనాటిక్స్, ఏవియేషన్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ వంటి వివిధ విభాగాలలోని ప్రముఖ నిపుణులకు సౌదీ జాతీయత మంజూరు చేయబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట మరియు సృజనాత్మక వ్యక్తులు సౌదీ అరేబియాలో నివసించడానికి మరియు పని చేయడానికి మార్గం సుగమం అవుతుందని నివేదిక తెలిపింది. నివేదించబడిన సహజీకరణలో ముస్లిమేతర నిపుణులు కూడా ఉన్నారా అనేదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







