విజన్ 2030: వివిధ విదేశీ నిపుణులకు జాతీయతను మంజూరు చేయనున్న సౌదీ
- December 05, 2019రియాద్: 2016 లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం సౌదీ విజన్ 2030 కు అనుగుణంగా చమురు ఆధారిత సౌదీ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరుస్తూ జాతీయ అభివృద్ధి మరియు పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రతిభావంతులైన విదేశీ నిపుణులకు సౌదీ జాతీయతను మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసిన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్.
దాదాపు రెండు నెలల క్రితం జారీ చేసిన రాయల్ డిక్రీ ప్రకారం, ఇస్లామిక్ పండితులతో పాటు అణు మరియు పునరుత్పాదక ఇంధనం, మెడిసిన్, ఫార్మకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆయిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎకాలజీ, ఆస్ట్రోనాటిక్స్, ఏవియేషన్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ వంటి వివిధ విభాగాలలోని ప్రముఖ నిపుణులకు సౌదీ జాతీయత మంజూరు చేయబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట మరియు సృజనాత్మక వ్యక్తులు సౌదీ అరేబియాలో నివసించడానికి మరియు పని చేయడానికి మార్గం సుగమం అవుతుందని నివేదిక తెలిపింది. నివేదించబడిన సహజీకరణలో ముస్లిమేతర నిపుణులు కూడా ఉన్నారా అనేదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్