షీషా కేఫ్లపై నిషేధం విధించే యోచనలో అధికారులు
- December 08, 2019
షీషా కేఫ్లో ప్రైవేట్ గదులకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది. కేఫ్ లో క్లోజ్డ్ రూమ్స్లపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. పారిశ్రమ, పర్యాటక శాఖ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించటంపై కసరత్తు చేస్తోంది. షీషా కేఫ్లో కొన్ని క్లోజ్డ్ వీఐపీ రూమ్స్ ఉంటాయి. పూర్తి ప్రైవసీ కోరుకునే వారు వీటిని అద్దెకు ఇస్తారు.
అయితే..పలు కారణాలతో షీషా కేఫ్ లో ఉండే ఈ ప్రైవసి గదులపై ఆరోగ్య మంత్రిత్వశాఖ నిషేధం విధించే యోచనలో ఉంది. ప్రధానంగా యువత ఈ క్లోజ్డ్ రూమ్స్ లో అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే..షీషా కల్చర్పై ఉక్కుపాదం మోపేలా త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రాబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనసమర్దక ప్రాంతాలు, ఫుట్ పాత్ లు, ప్రార్థన స్థలాల్లో షీషాలను అందించే వారికి శిక్ష విధించేలా కొత్త చట్టం ఉండబోతోంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







