షీషా కేఫ్‌లపై నిషేధం విధించే యోచనలో అధికారులు

- December 08, 2019 , by Maagulf
షీషా కేఫ్‌లపై నిషేధం విధించే యోచనలో అధికారులు

షీషా కేఫ్‌లో ప్రైవేట్‌ గదులకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది. కేఫ్‌ లో క్లోజ్డ్‌ రూమ్స్‌లపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. పారిశ్రమ, పర్యాటక శాఖ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించటంపై కసరత్తు చేస్తోంది. షీషా కేఫ్‌లో కొన్ని క్లోజ్డ్‌ వీఐపీ రూమ్స్‌ ఉంటాయి. పూర్తి ప్రైవసీ కోరుకునే వారు వీటిని అద్దెకు ఇస్తారు.

అయితే..పలు కారణాలతో షీషా కేఫ్‌ లో ఉండే ఈ ప్రైవసి గదులపై ఆరోగ్య మంత్రిత్వశాఖ నిషేధం విధించే యోచనలో ఉంది. ప్రధానంగా యువత ఈ క్లోజ్డ్‌ రూమ్స్‌ లో అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే..షీషా కల్చర్‌పై ఉక్కుపాదం మోపేలా త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రాబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనసమర్దక ప్రాంతాలు, ఫుట్‌ పాత్ లు, ప్రార్థన స్థలాల్లో షీషాలను అందించే వారికి శిక్ష విధించేలా కొత్త చట్టం ఉండబోతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com