షీషా కేఫ్లపై నిషేధం విధించే యోచనలో అధికారులు
- December 08, 2019షీషా కేఫ్లో ప్రైవేట్ గదులకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది. కేఫ్ లో క్లోజ్డ్ రూమ్స్లపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. పారిశ్రమ, పర్యాటక శాఖ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించటంపై కసరత్తు చేస్తోంది. షీషా కేఫ్లో కొన్ని క్లోజ్డ్ వీఐపీ రూమ్స్ ఉంటాయి. పూర్తి ప్రైవసీ కోరుకునే వారు వీటిని అద్దెకు ఇస్తారు.
అయితే..పలు కారణాలతో షీషా కేఫ్ లో ఉండే ఈ ప్రైవసి గదులపై ఆరోగ్య మంత్రిత్వశాఖ నిషేధం విధించే యోచనలో ఉంది. ప్రధానంగా యువత ఈ క్లోజ్డ్ రూమ్స్ లో అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే..షీషా కల్చర్పై ఉక్కుపాదం మోపేలా త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రాబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనసమర్దక ప్రాంతాలు, ఫుట్ పాత్ లు, ప్రార్థన స్థలాల్లో షీషాలను అందించే వారికి శిక్ష విధించేలా కొత్త చట్టం ఉండబోతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ