షార్జాలో భారత విద్యార్ధిని మృతి

- December 08, 2019 , by Maagulf
షార్జాలో భారత విద్యార్ధిని మృతి

షార్జాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల బాలిక పదో అంతస్తుపై నుంచి పడి మృతిచెందింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే..ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను కువైటీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఘర్బ్ పోలీసుల కస్టడీలో  ఉన్నారు. బాలిక మృతి కారణాలు, ఘటన జరిగిన తీరుపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సైంటిఫిక్ ఆధారాల కోసం మృతదేహ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. చనిపోయిన బాలిక పదో గ్రేడ్ చదువుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com