షార్జాలో భారత విద్యార్ధిని మృతి
- December 08, 2019షార్జాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల బాలిక పదో అంతస్తుపై నుంచి పడి మృతిచెందింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే..ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను కువైటీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఘర్బ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. బాలిక మృతి కారణాలు, ఘటన జరిగిన తీరుపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సైంటిఫిక్ ఆధారాల కోసం మృతదేహ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. చనిపోయిన బాలిక పదో గ్రేడ్ చదువుతోంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు