షార్జాలో భారత విద్యార్ధిని మృతి
- December 08, 2019
షార్జాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల బాలిక పదో అంతస్తుపై నుంచి పడి మృతిచెందింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే..ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను కువైటీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఘర్బ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. బాలిక మృతి కారణాలు, ఘటన జరిగిన తీరుపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సైంటిఫిక్ ఆధారాల కోసం మృతదేహ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. చనిపోయిన బాలిక పదో గ్రేడ్ చదువుతోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







