దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించనున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ
- December 11, 2019దుబాయ్: ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఈ నెల 12వ తేదీన దుబాయ్ లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నారు. రాణీ నటించిన తాజాగా చిత్రం 'మర్దానీ 2' విడుదల సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె దుబాయ్ సందర్శనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు రాణీ ముఖర్జీకి లా మెర్లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డీరా సిటీ సెంటర్లోని వోక్స్ సినిమాస్లో దుబాయ్ పోలీసుల కోసం ప్రత్యేక షోను కూడా ఏర్పాటు చేసింది.
2014లో విడుదలైన 'మర్దానీ'కి సీక్వెల్గా వస్తున్న 'మర్దానీ 2' ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసు సూపరింటెండెంట్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే విడుదలైన 'మర్దానీ 2' ట్రైలర్ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ-ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- అనుమతి లేకుంటే.. SR5,000 జరిమానా.. TGA వార్నింగ్
- విజిట్ వీసా ఉల్లంఘన.. స్పాన్సర్,టూరిస్టుపై బహిష్కరణ వేటు!
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!