దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించనున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ
- December 11, 2019దుబాయ్: ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఈ నెల 12వ తేదీన దుబాయ్ లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నారు. రాణీ నటించిన తాజాగా చిత్రం 'మర్దానీ 2' విడుదల సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె దుబాయ్ సందర్శనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు రాణీ ముఖర్జీకి లా మెర్లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డీరా సిటీ సెంటర్లోని వోక్స్ సినిమాస్లో దుబాయ్ పోలీసుల కోసం ప్రత్యేక షోను కూడా ఏర్పాటు చేసింది.
2014లో విడుదలైన 'మర్దానీ'కి సీక్వెల్గా వస్తున్న 'మర్దానీ 2' ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసు సూపరింటెండెంట్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే విడుదలైన 'మర్దానీ 2' ట్రైలర్ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు