వర్షంతో యూఏఈ-స్కాట్లాండ్ వన్డే మ్యాచ్ ఆలస్యం
- December 11, 2019షార్జా:ఈ ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా షార్జాలో వేదికగా జరగాల్సిన వన్డే క్రికెట్ మ్యాచ్ ఆలస్యం కానుంది. వరల్డ్ కప్ లీగ్ -2 లో భాగంగా ఈ రోజు యూఏఈ- స్కాంట్లాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆకాశంలోని మేఘాలు క్లియర్ అయ్యాయి. సూర్యకాంతి కూడా వచ్చింది. అయితే..గ్రౌండ్ ఔట్ ఫీల్డ్ లో ఇంకా నీరు నిలిచి ఉండటం మ్యాచ్ ఆలస్యానికి కారణం అవుతోంది. గ్రౌండ్ స్టాప్ మైదానాన్ని డ్రైగా మార్చి మ్యాచ్ కు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మ్యాచ్ కొనసాగాలంటే ఇరుజట్లు కనీసం 20 ఓవర్లైనా ఆడేంత సమయం ఉండాలి. ఒకవేళ మ్యాచ్ మధ్యాహ్నం 2.45 గంటల వరకల్లా ప్రారంభం కాకుంటే వన్డే పూర్తిగా రద్దు అవుతుంది. యూఏఈ, స్కాట్లాండ్ కు చెరోక పాయింట్ దక్కుతుంది. ఈ సీరిస్ లో యూఏఈ గత ఆదివారం యూఎస్ తో ఓ మ్యాచ్ ఆడి ఓడిపోయింది. స్కాట్లాండ్ కూడా యూఎస్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సిరీస్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జట్టు 2023లో భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సిరీస్ లో యూఎస్ టీం టాప్ పొజిషన్ లో ఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ
- 2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- బహ్రెయిన్లో ప్రైవేట్ యూనివర్సిటీ పై స్టూడెంట్ దావా
- ఒమానీ ఫలాజ్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్లు..యునెస్కో
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- దుబాయ్ కొత్త లోగోను ఆవిష్కరించిన క్రౌన్ ప్రిన్స్
- ప్రతి మహిళ శక్తి రూపంలో కన్పిస్తుంది: ప్రధాని మోడీ