నేటితో ముగియనున్న ఐసిబి టాలెంట్ ఫెస్ట్ 2019
- December 12, 2019
బహ్రెయిన్: ఇండియన్ క్లబ్ బహ్రెయిన్ నిర్వహిస్తోన్న చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్టివల్ - ఐసిబి టాలెంట్ ఫెస్ట్ 2019 నేటితో ముగియనున్నట్లు ప్రకటించింది. 1288 మంది చిన్నారులు, ఆరు కేటగిరీల్లో ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్, ఈ రోజు జరిగే గ్రాండ్ ఫినాలెతో ముగుస్తుంది. ఇండియన్ క్లబ్ ప్రాంగణంలో ఈ వేడుకలు జరుగుతాయి. లిటరేచర్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ సహా పలు ఇతర ఈవెంట్స్లో పోటీలు జరిగాయి. 5 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. నమితా ప్రమోద్ ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా, గెస్ట్ ఆఫ్ హానర్గా ఇండియన్ మూవీ మేకర్ బోబన్ సామ్యుయేల్ వ్యవహరిస్తారు. ఐసిబి ఆర్టిస్టిక్ పెరల్గా శిల్పా సంతోష్ ప్రకటితమయ్యారు. లిటరరీ డైమండ్ 2019 పురస్కారానికి శ్రీహంసిని బాలమురుగన్ ఎంపిక కావడం గమనార్హం. ఆర్టిస్టిక్ స్పెషల్ అవార్డ్ మియా మరియమ్ అలెక్స్ గెల్చుకున్నారు. రిత్విక శ్రీనాథ్, గ్రూప్ త్రీ స్పెషల్ అవార్డ్ దక్కించుకున్నారు. ఐసిబి టాలెంట్ ఫెస్ట్ స్పెసల్ అవార్డ్ని అద్వయిత్ కుమార్ అందుకోనున్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









