హైదరాబాద్:హెచ్1బీ ఇప్పిస్తానంటూ మోసం..
- December 13, 2019
హైదరాబాద్: హైదరాబాద్లోని అమీర్పేట డివిజన్లో సాఫ్ట్వేర్ సంస్థల నిర్వాహకుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా వెళ్లేందుకు హెచ్1బీ వీసా ఇప్పిస్తానని చెప్పి రూ. 3 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు ఓ సంస్థ నిర్వాహకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్ నగర్లో నివసిస్తున్న టెక్నికల్ ఆర్కిటెక్ట్ యామినీ భాస్కర్రావు అమెరికా వెళ్లేందుకు అమీర్పేటలో ఉన్న ఎక్సెల్ సాఫ్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు రోసారియో మాథ్యూ్సను కలిశారు.
హెచ్1బి వీసా కావాలంటే ముందుగా రూ. 3 లక్షల చెల్లించాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన భాస్కర్రావు మాథ్యూస్ ఖాతాకు నగదు బదిలీ చేశారు. మొదటి ఫేజ్ ఇంటర్వ్యూ, పరీక్ష పూర్తయింది. రెండో ఫేజ్ దాటేందుకు రోసారియో వద్దకు వెళ్లగా.. స్కిల్ డెవల్పమెంట్ సరిగా లేదని, హెచ్1బి వీసా రావడం కష్టమని చెప్పాడు. బాధితుడు అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో భాస్కర్రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు నుంచి ఎస్ఆర్నగర్ పోలీసులకు రిజిస్టర్ పోస్టులో లేఖ అందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సెక్టార్ ఎస్ఐ సాయినాథ్ తెలిపారు
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







