పాస్పోర్టులపై కమలం గుర్తు
- December 13, 2019
న్యూఢిల్లీ: కొత్త పాస్పోర్టులపై కమలం గుర్తు ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్పోర్టులను గుర్తించేందుకే కమలం చిహ్నాన్ని ముద్రించినట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. కేరళలోని కోజికోడ్లో లోటస్ గుర్తు ముద్రించిన కొత్త పాస్పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్సభలో జీరో అవర్లో లేవనెత్తారు. కమలం బీజేపీ గుర్తు కనుక ఇలా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రవీష్ కుమార్ ఆయన ఆరోపణలను కొట్టిపడేశారు. నకిలీ పాస్పోర్టులను గుర్తించడంతోపాటు భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే కమలం గుర్తును ముద్రించామని, అది మన జాతీయ చిహ్నమని పేర్కొన్నారు. అది ఒక్క కమలం గుర్తుతో ఆగిపోదని, ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్ధతిలో పాస్పోర్టులపై ముద్రిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







