పాస్పోర్టులపై కమలం గుర్తు
- December 13, 2019
న్యూఢిల్లీ: కొత్త పాస్పోర్టులపై కమలం గుర్తు ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్పోర్టులను గుర్తించేందుకే కమలం చిహ్నాన్ని ముద్రించినట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. కేరళలోని కోజికోడ్లో లోటస్ గుర్తు ముద్రించిన కొత్త పాస్పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్సభలో జీరో అవర్లో లేవనెత్తారు. కమలం బీజేపీ గుర్తు కనుక ఇలా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రవీష్ కుమార్ ఆయన ఆరోపణలను కొట్టిపడేశారు. నకిలీ పాస్పోర్టులను గుర్తించడంతోపాటు భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే కమలం గుర్తును ముద్రించామని, అది మన జాతీయ చిహ్నమని పేర్కొన్నారు. అది ఒక్క కమలం గుర్తుతో ఆగిపోదని, ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్ధతిలో పాస్పోర్టులపై ముద్రిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!









