యూఏఈ: కఠిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్లోకి ఉత్పత్తులు
- December 14, 2019
దేశంలో అమ్మే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు తాము భరోసా ఇస్తున్నామని యూఏఈ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్ట్స్ ఏవైనా నాణ్యత విషయంలో కఠిన ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. యూఏఈలో తయారైన ఉత్పత్తులతో పాటు విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రొడక్ట్స్ ఎమిరెట్స్ క్వాలిటీ మార్క్ కు అనుగుణంగా ఉన్నాయని ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మెట్రాలజీ-Esma అధికారులు తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ వామ్ వివరించింది. ప్రమాణాలను పాటించని ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత వారం క్యాన్సర్ కారకం ఆస్బెస్టాస్ ఫైబర్స్ ఉన్నట్లు గుర్తించిన 41 బ్రాండ్ల థర్మల్ ప్లాస్క్ లను వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. సురక్షితమైన ఫ్లాస్క్ ల కోసం ESMAతో స్థాపించబడిన ఎమిరేట్స్ కన్ఫార్మిటీ అసెస్మెంట్ సిస్టమ్ మార్క్ ఉన్న ఫ్లాస్క్లను మాత్రమే కొనుగోలు చేయాలని వినియోగదారులకు అధికారులు సూచించారు.
అయితే.. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, ఫిర్యాదుదారులు రెగ్యూలేటరీ అధికారులను సంప్రదించాలని సూచించారు. అయితే..యూఏఈలో తయారయ్యే అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులు అత్యున్నత ప్రమాణాలతో వినియోగదారుల అంచనాల తగినట్లు ఉన్నాయని ESMA అధికారులు చెబుతున్నారు. ఆస్బెస్టాస్ ఉన్న థర్మల్ ప్లాస్క్ లను మార్కెట్లో నుంచి ఉపసంహరించుకునేందుకు Esma అధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వినియోగదారుల రక్షణ విభాగం ముఖ్య అధికారి మొహమ్మద్ లూతహ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు









