గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి ఘటించిన చిరంజీవి

- December 15, 2019 , by Maagulf
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి ఘటించిన చిరంజీవి

ప్రముఖ రచయిత, నటుడు, సాహితీ వేత్త అయిన గొల్లపూడి మారుతీరావు మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన గురువారం (డిసెంబర్ 12) కన్నుమూశారు. ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలను ఆదివారం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ప్రజల సందర్శానార్థం..
శనివారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి మార్చురీలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భౌతికకాయాన్ని... చెన్నైలోని... టి.నగర్‌ శారదాంబాళ్‌ వీధిలోని ఆయన ఇంటికి తీసుకొచ్చి... ప్రజల సందర్శన కోసం ఉంచారు. నటులు భానుచందర్‌, సుహాసిని, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రాజీవ్‌మేనన్‌, సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ మురారి, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఇంకా చాలా మంది గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com