22ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్!
- December 15, 2019
దేశంలోనే అత్యంత తక్కువ వయస్సులో ఐపీఎస్ ఆఫీసర్గా రికార్డు క్రియేట్ చెయ్యబోతున్నారు ఓ యువకుడు. గుజరాత్కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు.
గుజరాత్లోని పాలంపూర్ పట్టణం కనోదర్ గ్రామానికి చెందిన హసన్ సఫిన్.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ఇండియా స్థాయిలో 570 ర్యాంకు దక్కించుకున్నాడు. అనంతరం అతడు ఐపీఎస్ అధికారి పోస్టుకు ఎంపిక అయ్యాడు.
ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్ డిసెంబర్ 23వ తేదీన జామ్నగర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నారు. దేశంలో ఇంత చిన్న వయస్సులో ఇటువంటి బాధ్యతలు అందుకున్న ఫస్ట్ వ్యక్తి హసన్ కావడం విశేషం.
ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో కష్టపడిన హసన్ అది కుదరకపోవడంతో ఐపీఎస్గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు. హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంభాను ఇద్దరూ ఓ వజ్రాల కంపెనీకి సంబంధించిన చిన్న యూనిట్లో పనిచేస్తుంటారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







