ఢిల్లీలో పౌరసత్వ నిరసన జ్వాలలు
- December 15, 2019
ఢిల్లీ: భారత దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం నిరసన ప్రదర్శనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. హింసాత్మకంగా తయారయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ప్రదర్శనలు నిర్వహిస్తోన్న ఆందోళనకారులు.. ఆదివారం మరింత రెచ్చి పోయారు. బస్సులకు తగుల బెట్టారు. ఈ చర్యకు జామియా యూనివర్శిటీ విద్యార్థులే కారణమంటూ మొదట్లో వార్తలు తలెత్తాయి. యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాత్రం దీన్ని కొట్టి పారేశారు. ఆ చర్య తమది కాదని స్పష్టం చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో బస్సులపై దాడి..
ఢిల్లీలోని ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఆదివారం సాయంత్రం న్యూ ఫ్రెండ్స్ కాలనీ, ఆశ్రమ్ ఫ్లైఓవర్, సుఖ్ దేవ్ విహార్ సహా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు ఢిల్లీ ప్రజా రవాణా సంస్థ బస్సులను తగులబెట్టారు. మరి కొన్నింటి అద్దాలను పగుల గొట్టారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







