స్పైస్‌జెట్‌ ఉద్యోగులు ధర్నా

- January 15, 2016 , by Maagulf
స్పైస్‌జెట్‌ ఉద్యోగులు ధర్నా

 శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం స్పైస్‌జెట్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విమానాశ్రయం నుంచి 180 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు వచ్చి ధర్నా చేపట్టారు. గత రెండేళ్ల నుంచి తమకు జీతాలు పెంచడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. తమ వేతనాలు పెంచడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చేంతవరకు ఆందోళన విరమించబోమని వారు తేల్చి చెబుతున్నారు. స్పైస్‌ జెట్‌ ఉద్యోగుల ఆందోళనకారణంగా ఐదు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com