తలైవా 168 సినిమా షూటింగ్ ప్రారంభం
- December 18, 2019
హైదరాబాద్:సూపర్ స్టార్ రజినీకాంత్ 168 చిత్రం శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీఫిలిం సిటీ లో ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ , మీనా , కుష్బూ , ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
ఇక ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రజనీ నటించిన దర్భార్ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న రాబోతుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. రజినీ-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..