తలైవా 168 సినిమా షూటింగ్ ప్రారంభం
- December 18, 2019
హైదరాబాద్:సూపర్ స్టార్ రజినీకాంత్ 168 చిత్రం శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీఫిలిం సిటీ లో ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ , మీనా , కుష్బూ , ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
ఇక ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రజనీ నటించిన దర్భార్ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న రాబోతుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. రజినీ-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







