దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రా ప్రకటన; ఫిలిపిన, ఇండియన్ లక్కీ ఫెలోస్
- December 20, 2019
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రాలో వలసదారుల పంట పండింది. ఫిలిపినకు చెందిన మెలోడీ కర్టియానియా మిలియన్ యూఎస్ డాలర్లను ప్రైజ్ మనీగా గెలుచుకుంది. మరో ఇండియన్ కూడా మిలియన్ యూఎస్ డాలర్లు విన్ అయినట్లు తెలుస్తున్నా..నిర్వాహకులు అతని పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. లక్కీ డ్రా విన్నర్ మెలోడీ
కర్టియానియా దుబాయ్ లోని ఓ బీమాసంస్థలో పని చేస్తోంది. డ్రాలో మిలియన్ డాలర్లు విన్ అయినట్లు తెలుసుకోగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాను దేవుణ్ణి ఎంతగానే ప్రార్ధించానని..తన ప్రార్థనలు నిజం అయ్యాయని కర్టియానియా ఆనందం వ్యక్తం చేసింది. క్రిస్మస్ తో తన భర్త్ డేకి మరిచిపోలేని గిఫ్ట్ ప్రకటించారంటూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు ఈ డ్రాలో మరో ముగ్గురు లగ్జరీ వాహనాలను గెలుచుకున్నారు. యుకెకు చెందిన విలియం డంకన్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ 560, జర్మనీకి చెందిన రైఫ్ సైనోజిక్ రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ 360 పిఎస్ మోడల్ కార్లను డ్రాలో విన్ అయ్యారు. ఇండియన్ మహ్మద్ మోమిన్ ఎపిల్లా టుయోనో ఆర్ఆర్ మోటర్బైక్ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







