మృత శిశువును చెత్తకుప్పలో పడేసిన తల్లికి 6 నెలల జైలు శిక్ష
- December 20, 2019
దుబాయ్:అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పలో పడేసిన కేసులో తల్లికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది దుబాయ్ కోర్టు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇల్లీగల్ అఫైర్ వల్లే ఈ దారుణానికి ఓడిగట్టినట్లు రుజువు కావటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిలిపినాకు చెందిన 35 ఏళ్ల
మహిళ ఫిలిపిన, పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కొన్నాళ్లుగా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. ఫలితంగా ప్రెగ్నెన్స్ రావటంతో మృతిచెందిన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ముగ్గురు కలిసి బేబి డెడ్ బాడీని ప్యాక్ చేసి అల్ బరాహా ప్రాంతంలోని చెత్తకుప్పలో పడేశారు.
అయితే..చెత్తకుప్పలో చిన్నారి డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 38 ఏళ్ల పాకిస్తానీ బేబీని చెత్తకుప్పలో వేసినట్లు నిర్ధారించుకొని అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయటంతో అసలు విషయం బయటపడింది. చిన్నారి డెడ్ బాడీని ప్యాక్ చేసి ఇచ్చిన 50 ఏళ్ల ఫిలిపిన వ్యక్తితో పాటు ఆ
తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ తల్లి కూడా నిజాలను ఒప్పుకుంది. దీంతో దుబాయ్ కోర్టు తల్లికి ఆరు నెలల జైలు శిక్ష..ఆమెకు సహకరించిన పాకిస్తానీ, ఫిలిపిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు...ఫిలిపినకు చెందిన ఇద్దరి వీసా ఎక్స్ పైర్ కావటంతో ఆ ఇద్దరికి అదనంగా మరో నెల జైలు శిక్షను ఖరారు
చేసింది కోర్టు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









