భారత్- ఒమన్ మధ్య సముద్ర రవాణా ఒప్పందం
- December 25, 2019
ఒమన్:భారత్-ఒమన్ మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. సముద్ర రవాణా రంగంలో సాయం చేసుకునేలా రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి యూసుఫ్ బిన్ అలవి బిన్ అబ్ధుల్లా అగ్రిమెంట్ పేపర్స్ పై సంతాకాలు చేశారు. 2017లో భారత్ లో పర్యటించిన యూసుఫ్ బిన్ అలవి బిన్ అబ్ధుల్లా ఆహ్వానం మేరకు ప్రస్తుతం ఒమన్ పర్యటనకు జయశంకర్ వచ్చారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ఒమనీ మంత్రులు, కీలక అధికారులతో సమావేశం అవుతారు. అలాగే మస్కట్ వేదికగా ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం అవుతారు.
భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్ దేశాల్లో ఒమన్ కూడా కీలక దేశం. రెండు దేశాల భౌగోళిక పరిస్థితులు, హిస్టరీ, కల్చర్ లో సారుప్యత ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత మెరుగయ్యేలా దోహదపడుతోంది. 2018లో భారత ప్రధాని మోదీ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అయ్యాయి. ఒమన్ కు ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్ నర్ గా ఉంది. 2018-19 రెండు దేశాల మధ్య US$5 బిలియన్ల ట్రేడింగ్ జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







