భారత్- ఒమన్ మధ్య సముద్ర రవాణా ఒప్పందం
- December 25, 2019
ఒమన్:భారత్-ఒమన్ మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. సముద్ర రవాణా రంగంలో సాయం చేసుకునేలా రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి యూసుఫ్ బిన్ అలవి బిన్ అబ్ధుల్లా అగ్రిమెంట్ పేపర్స్ పై సంతాకాలు చేశారు. 2017లో భారత్ లో పర్యటించిన యూసుఫ్ బిన్ అలవి బిన్ అబ్ధుల్లా ఆహ్వానం మేరకు ప్రస్తుతం ఒమన్ పర్యటనకు జయశంకర్ వచ్చారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ఒమనీ మంత్రులు, కీలక అధికారులతో సమావేశం అవుతారు. అలాగే మస్కట్ వేదికగా ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం అవుతారు.
భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్ దేశాల్లో ఒమన్ కూడా కీలక దేశం. రెండు దేశాల భౌగోళిక పరిస్థితులు, హిస్టరీ, కల్చర్ లో సారుప్యత ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత మెరుగయ్యేలా దోహదపడుతోంది. 2018లో భారత ప్రధాని మోదీ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అయ్యాయి. ఒమన్ కు ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్ నర్ గా ఉంది. 2018-19 రెండు దేశాల మధ్య US$5 బిలియన్ల ట్రేడింగ్ జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







