పశ్చిమ ఆఫ్రికా:క్రిస్మస్ వేడుకల్లో మారణహోమం:35 మంది మృతి

- December 25, 2019 , by Maagulf
పశ్చిమ ఆఫ్రికా:క్రిస్మస్ వేడుకల్లో మారణహోమం:35 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. రంగంలోకి దిగిన సైనిక బలగాలు కాల్పులు జరిపాయి. 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం(డిసెంబర్ 24,2019) అర్ధరాత్రి ఈ ఘటన చోటు జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com