హైదరాబాద్:ఉద్యోగాల పేరుతో దుబాయ్ కు యువతులు..
- December 25, 2019
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో ఆర్థిక సమస్యలతో బాధపడే యువతులను టార్గెట్ చేసి లక్షల రూపాయలు దండుకుంటోన్న కి'లేడీ'ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను దుబాయ్ కి పంపి లక్షల్లో దండుకుంటున్న కిలేడీలను పట్టుకున్నారు. ఈ కి'లేడీ'ల ఉచ్చులో పడి కొన్ని నెలల క్రితం ఒక యువతి షార్జాకు వెళ్లి హైదరాబాద్ కు తిరిగి రావడంతో కి'లేడీ'ల బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు హైదరాబాద్ కు వచ్చిన తరువాత తమ గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని కి'లేడీ'లు బెదిరించడం గమనార్హం. కి'లేడీ'లు బాధితురాలికి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం ఉండదని పోలీసులు కూడా తమ గుప్పిట్లోనే ఉన్నారని బెదిరించారు. పూర్తి వివరాలలోకి వెళితే అయేషా సిద్ధికా బేగమ్ అనే యువతి హైదరాబాద్ లోని యాకుత్ పురాలో నివాసం ఉంటోంది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల కోసం వెతుకుతున్న అయేషాకు ఇద్దరు మహిళలు పరిచయం అయ్యారు. మహిళలు అయేషాకు దుబాయ్ లో నెలకు 30,000 రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఆలనాపాలన చూసుకుంటే మాత్రం చాలని చెప్పి నమ్మించారు. 2018 అక్టోబర్ నెలలో విజిట్ వీసాపై దుబాయ్ కు వెళ్లిన అయేషాను అక్కడ ఒక వ్యక్తి ఒక ఇంట్లో పనిలో చేర్పించాడు.
అక్కడ అయేషాను కొడుతూ ఉండటంతో ఆమె ఉద్యోగం ఇప్పించిన వ్యక్తిని కలిసి మరో ఇంటికి వెళ్లింది. అక్కడ అయేషాతో రోజుకు 20 గంటలు పని చేయించుకొని సరైన ఆహారం, వసతి కల్పించకపోవటంతో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని కలిసి ఇండియా తిరిగి పంపించాలని అయేషా కోరింది. 2 లక్షల రూపాయలు ఇస్తే మాత్రమే ఇండియాకు పంపుతానని హైదరాబాద్ లోని ఇద్దరు మహిళలకు ఆ మొత్తం ఇచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు. అయేషా భర్త ఎంబిటీ అనే సంస్థ సహాయంతో భారత రాయబార కార్యాలయంలో మాట్లాడి మహిళను భారత్ కు రప్పించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







