జనవరి 1నుంచి ఎస్బీఐ కొత్త రూల్..
- December 27, 2019
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కస్టమర్లు నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఎప్పటికప్పుడు అలెర్ట్ మెసేజ్లు ఇస్తున్నా మోసాల బారిన పడుతున్నారు. ఈసారి మరింత పడబ్భందీగా ఏటీఎం మోసాలను అరికట్టేందుకు మరో కొత్త నిర్ణయం తీసుకుంది. దీంతో తన ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని ఎస్బీఐ భావిస్తోంది. వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత క్యాష్ విత్డ్రా సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే అన్ని లావాదేవీలకు ఇది వర్తించదు. కేవలం రూ.10,000 పైన ఉన్న ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.
బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్ అకౌంట్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే డబ్బు తీసుకునే వీలుంటుంది. దీంతో మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టొచ్చని బ్యాంక్ భావిస్తోంది. ఈ ఓటీపి ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఫెసిలిటీ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు మీ కార్డుని మరో బ్యాంకులో ఉపయోగిస్తే అక్కడ ఓటీపీ పనిచేయదు. కేవలం ఎస్బీఐలో మాత్రమే పనిచేస్తుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







