మక్కా పిల్గ్రిమ్స్ లో ఆసియానే టాప్‌

- December 28, 2019 , by Maagulf
మక్కా పిల్గ్రిమ్స్ లో ఆసియానే టాప్‌

జెడ్డా: 2,371,441 ఉమ్రా వీసాల్ని ఆగస్ట్‌ 31 నుంచి డిసెంబర్‌ 20లోపు జారీ చేసినట్లు ఉమ్రా వీక్లీ ఇండెక్స్‌ని బట్టి అర్థమవుతోంది. ఎయిర్‌, ల్యాండ్‌ అలాగే సీ పోర్ట్స్‌ ద్వారా వచ్చిన ఉమ్రా యాత్రీకుల సంఖ్య ఇది. కాగా, భారతదేశం నుంచి 262,887 మంది పిల్గ్రిమ్స్ ఉమ్రా ప్రార్థనల కోసం వీసాలు పొందారు. పాకిస్తాన్‌ నుంచి అత్యధికంగా 495,270 మంది ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చారు. ఇండోనేసియా (448,879), మలేసియా (116,335), ఈజిప్ట్‌ (104,820), అల్జీరియా (80,238), టర్కీ (78,512), బంగ్లాదేశ్‌ (73,142), యూఏఈ (46,370) మరియు జోర్డాన్‌ (32,011) దేశాలకు చెందిన ఫిలిగ్రిమ్స్‌ వీసాల్ని పొందారు, ఉమ్రా ప్రార్థనలు నిర్వహించుకుని స్వదేశాలకు తిరిగి వెళ్ళారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com