బహ్రెయిన్:డ్రగ్స్‌ కేసులో విచారణ ప్రారంభం

- December 28, 2019 , by Maagulf
బహ్రెయిన్:డ్రగ్స్‌ కేసులో విచారణ ప్రారంభం

బహ్రెయిన్:హై క్రిమినల్‌ కోర్టు, 3,000 నార్కోటిక్‌ పిల్స్‌తో పట్టుబడ్డ జిసిసి జాతీయుడి కేసు విచారణని ప్రారంభించింది. అరబ్‌ దేశం నుంచి వచ్చిన ట్రాన్సిట్‌ విమానం ద్వారా ప్రయాణించిన నిందితుడు, నార్కోటిక్‌ పిల్స్‌తో కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు. అతన్ని పరిశీలించగా, నార్కోటిక్‌ పిల్స్‌ లభ్యమయ్యాయి. కాగా, 5,000 సౌదీ రియాల్స్‌ మొత్తానికి నార్కోటిక్‌ పిల్స్‌ని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడిపై అభియోగాలు నిరూపితమైతే భారీ జరీమానాని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశంలో వాటి ఖరీదు 20,000 వరకూ వుంటుందనీ, అందుకే తాను ఈ ఒప్పందం కుదుర్చుకున్నాననీ చెబుతున్నాడు. అయితే, నార్కోటిక్‌ పిల్స్‌ని వ్యక్తిగత వినియోగం కోసమే తాను తీసుకెళుతున్నట్లు నిందితుడు చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com