యూఏఈ టూరిస్ట్ స్పాట్స్ లో రూల్స్ బ్రేక్.. 2 రోజుల్లో Dh31,500 ఫైన్
- December 29, 2019
రస్-అల్-ఖైమాలోని టూరిస్ట్ స్పాట్స్ లో ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ సంఖ్య పెరుగుతోంది. పరిశుభ్రతకు యూఏఈ కంట్రీస్ అత్యంత ప్రధాన్యం ఇస్తాయి. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే ఫైన్ చెల్లించక తప్పదు. కానీ, కొన్నాళ్లుగా ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ టూరిస్ట్ స్పాట్స్ ని గార్బేజ్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావటంతో పర్యాటక ప్రాంతాలన్ని విజిటర్స్ తో సందడిగా మారాయి. ఎండలతో విసిగిపోయిన జనాలు శీతాకాలపు చల్లని గాలులను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే...నేచర్ ను ఎంజాయ్ చేస్తూనే అదే నేచర్ ను చెత్తతో నింపేస్తున్నారు. రూల్స్ కి విరుద్ధంగా చెత్తను కుప్పలుతెప్పలుగా పడేసి వెళ్తున్నారు. మౌంటెన్స్, డీసర్ట్ ఇలా పర్యాటక ప్రాంతాలను వేస్టేజ్ తో నింపేస్తున్నారు. వీకెండ్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే(శుక్ర, శనివారాల్లో) 63 మంది ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ కి ఫైన్ వేశారు. ఒక్కొక్కరికి 500 దిర్హామ్ ల చొప్పున 31,500 దిర్హామ్ ల ఫైన్ కలెక్ట్ చేశారు. సాధారణ రోజుల్లో 10 మంది వరకు ఇలా ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ ఉంటారని పాట్రోలింగ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. వీకెండ్ లో మాత్రం ఇలాంటి రూల్ బ్రేకర్స్ సంఖ్య 63కు పెరుగుతుందని వివరించారు.
టూరిస్ట్ స్పాట్స్ లో క్యాంప్ కు వెళ్లండి, సైట్ సీయింగ్ ఎంజాయ్ చేయండి, నేచర్ ను ఆస్వాదించండి..కానీ, దేశం ఇమేజ్ దెబ్బతీసేలా చెత్తను మాత్రం పడేయకండి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ రోడ్స్, పార్క్స్, బీచెస్ లో ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ ని పడేసి వెళ్తున్నారని..ఇలా పర్యావరణాన్ని పాడు చేసే వారి గురించి 8008118 కి డయల్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ







