శంషాబాద్ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత
- January 16, 2016
అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో బంగారం తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో విమానం దిగి వస్తున్న ప్రయాణికులను అసిస్టెంట్ కమిషనర్ విశ్వాస్ మరికొంతమంది అధికారులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా సిగరెట్ ప్యాకెట్లలో పెట్టుకొని తీసుకొస్తున్న నాలుగున్నర కిలోల బంగారం బిస్కెట్లు అతడి వద్ద లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









