జీతాలు చెల్లించలేదు.. పైగా 'తొలగింపు' హెచ్చరికలు
- January 02, 2020
కువైట్ సిటీ: 200 మంది కార్మికులకు ఓ కంపెనీ జీతాలు చెల్లించకపోగా, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్తో కాంట్రాక్ట్ వున్న కంపెనీ కార్మికుల తరఫున లేబర్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ - ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ సెక్టార్ వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించనుంది. అథారిటీ ఈపీఎస్, సదరు కంపెనీ రిప్రెజెంటేటివ్స్కి ఈ విషయమై ఇప్పటికే సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ముగిసిన తర్వాత తమతో కంపెనీ బార్గెయినింగ్కి దిగిందనీ, 900 దిర్హామ్లు ఇచ్చి, ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతిస్తామని ఆ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారనీ, లేదంటే దేశం వదిలి వెళ్ళాలని హెచ్చరిస్తున్నారని కార్మికులు వాపోయారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని తాము గతంలోనే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి ఫిర్యాదు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







