జీతాలు చెల్లించలేదు.. పైగా 'తొలగింపు' హెచ్చరికలు
- January 02, 2020
కువైట్ సిటీ: 200 మంది కార్మికులకు ఓ కంపెనీ జీతాలు చెల్లించకపోగా, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్తో కాంట్రాక్ట్ వున్న కంపెనీ కార్మికుల తరఫున లేబర్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ - ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ సెక్టార్ వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించనుంది. అథారిటీ ఈపీఎస్, సదరు కంపెనీ రిప్రెజెంటేటివ్స్కి ఈ విషయమై ఇప్పటికే సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ముగిసిన తర్వాత తమతో కంపెనీ బార్గెయినింగ్కి దిగిందనీ, 900 దిర్హామ్లు ఇచ్చి, ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతిస్తామని ఆ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారనీ, లేదంటే దేశం వదిలి వెళ్ళాలని హెచ్చరిస్తున్నారని కార్మికులు వాపోయారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని తాము గతంలోనే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి ఫిర్యాదు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







