'మా' వేదికగా మోహన్ బాబు - చిరంజీవి మధ్య వెల్లివిరిసిన స్నేహం..
- January 02, 2020
హైదరాబాద్: ఫిలింనగర్లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అబ్బురపరిచే సంఘటనకు వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య నున్న స్నేహబంధం వెల్లివిరిసింది. సభలో మాట్లాడిన మోహన్బాబు... తనకు, చిరంజీవికి మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమేనన్నారు. ఎప్పటికీ తమ రెండు కుటుంబాలు ఒక్కటేనని స్పష్టం చేశారు. మోహన్బాబు మాట్లాడుతున్నప్పుడే ఆయన దగ్గరకు చిరంజీవి వెళ్ళి, మెడ చుట్టూ చేతులు వేసి, ఆప్యాయతతో పలుకరించి బుగ్గపై ముద్దిచ్చి, భుజం తట్టి వెళ్ళారు.
ఇదే సభలో పాల్గొన్న 'మా' వైస్ ప్రెసిడెంట్, హీరో రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపై మోహన్ బాబు మండిపడ్డారు. 'మా' ఎవడబ్బ సొత్తు కాదు.. అందరి సొత్తు.. అన్నారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించి, పరిశ్రమను ఆదుకున్న ఏకైక వ్యక్తి టి.సుబ్బరామిరెడ్డి ఎదుట ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..