'మా' వేదికగా మోహన్ బాబు - చిరంజీవి మధ్య వెల్లివిరిసిన స్నేహం..
- January 02, 2020

హైదరాబాద్: ఫిలింనగర్లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అబ్బురపరిచే సంఘటనకు వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య నున్న స్నేహబంధం వెల్లివిరిసింది. సభలో మాట్లాడిన మోహన్బాబు... తనకు, చిరంజీవికి మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమేనన్నారు. ఎప్పటికీ తమ రెండు కుటుంబాలు ఒక్కటేనని స్పష్టం చేశారు. మోహన్బాబు మాట్లాడుతున్నప్పుడే ఆయన దగ్గరకు చిరంజీవి వెళ్ళి, మెడ చుట్టూ చేతులు వేసి, ఆప్యాయతతో పలుకరించి బుగ్గపై ముద్దిచ్చి, భుజం తట్టి వెళ్ళారు.
ఇదే సభలో పాల్గొన్న 'మా' వైస్ ప్రెసిడెంట్, హీరో రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపై మోహన్ బాబు మండిపడ్డారు. 'మా' ఎవడబ్బ సొత్తు కాదు.. అందరి సొత్తు.. అన్నారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించి, పరిశ్రమను ఆదుకున్న ఏకైక వ్యక్తి టి.సుబ్బరామిరెడ్డి ఎదుట ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







