ఒమన్లో రిక్రూట్మెంట్ ఏజెన్సీ మూసివేత
- January 02, 2020
మస్కట్: వినియోగదారులకు డొమెస్టిక్ సర్వీస్ అందిస్తోన్న ఓ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీని పలు ఫిర్యాదుల మేరకు అల్ దఖ్లియా గవర్నరేట్ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ - బహ్లా, ఈ ఏజెన్సీని మూసివేయాలని తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీకి 1,550 ఒమన్ రియాల్స్ జరీమానా కూడా విధించింది. కస్టమర్లను డూపింగ్ చేస్తున్నట్లు ఏజెన్సీపై ఫిర్యాదులు అందడమే దీనికి కారణం. వర్కర్స్ని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్లు తీసుకుని, వాటిని డిపాజిట్లుగా మలచి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. కన్స్యుమర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 900 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాలనీ, వినియోగదారులకు 1,550 ఒమన్ రియాల్స్ చెల్లించాలనీ న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







