ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కు భారీ జరిమానా
- January 07, 2020
హైదరాబాద్:ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వైఖరికి హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిషార్కారాల ఫోరం రూ.2లక్షల జరిమానా విధించింది. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయడం వంటి కారణాలతో ఈ తీర్పు వెల్లడించింది. దాంతో పాటు రద్దు చేసిన విమాన టికెట్ ఛార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ కు చెందిన వినయ్ కుమార్ సిన్హా(57), కృష్ణ సిన్హా(5)దంపతులు టిక్కెట్లు బుక్ చేసి 2017 జులై 12న డెట్రాయిట్ లోని బంధువులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా.. బోస్టన్ నుంచి డెట్రాయిల్ కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది.
నిర్దారిత సమయంలో డెట్రాయిట్ కు చేరుకోవడంలో విఫలమైంది ఆ విమానం. పైగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేశారు. దీంతో వారిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. న్యాయ విచారణ పూర్తి అయి తీర్పు వెల్లడైంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







