ఉక్రెయిన్ లో విమాన ప్రమాదం..170 మందికి పైగా ప్రయాణికుల మృతి

- January 08, 2020 , by Maagulf
ఉక్రెయిన్ లో విమాన ప్రమాదం..170 మందికి పైగా ప్రయాణికుల మృతి

ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం ఇరాన్‌లో కూలిపోయింది. ఈ విమానంలో 170 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది.

రాయిటర్స్ వార్తల ప్రకారం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం ప్రమాదానికి గురైందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ చెప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్తోంది.

విమానాశ్రయం దగ్గర ఘటనాస్థలం దగ్గరకు సహాయ సిబ్బందిని పంపించారు. "విమానం మంటల్లో ఉంది. కానీ మేం సిబ్బందిని పంపించాం. కొంతమందినైనా కాపాడగలమని అనుకుంటున్నాం" అని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ రాయిటర్స్‌తో అన్నట్లు ఇరాన్ టీవీ చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com